Vedma Bojju Patel: పేదింటి ఆడబిడ్డను ఆదరిద్దాం..పార్లమెంట్ కు పంపిద్దాం :ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

సిరాన్యూస్‌, పెంబి
పేదింటి ఆడబిడ్డను ఆదరిద్దాం..పార్లమెంట్ కు పంపిద్దాం :ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
కాంగ్రెస్ లో మాజీ సర్పంచులు

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుక ఈ ప్రాంత సమస్యలు తెలిసిన ఆడబిడ్డ ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించుకుని, పార్లమెంటుకు పంపిద్దామని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. గురువారం నిర్మ‌ల్ జిల్లా పెంబి మండలంలోని అంకెన, బుర్కాపల్లి, కోరకంటి, కర్ణంలోద్ధి, రాయదరి, పోచంపల్లి, గోధుమల, సూర్యగూడా తదితర గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు. రాయధరి, కోరకంటి,పోచంపల్లి గ్రామాల మాజీ సర్పంచులతో పాటు వారి అనుచరులు పెద్దఎత్తున ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాలలో ఏర్పాటుచేసిన సమావేశాలలో పాల్గొని ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికి పోరాడే ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారం కావాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. గతంలో పేద ప్రజల కోసం ప్రతిష్టాత్మకమైన పథకాలను అమలు చేసిన ఘనత తమపార్టీదన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *