సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
కాంగ్రెస్లో చేరిన ముదిరాజ్ సంఘం సభ్యులు
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని బీమన్న ఆలయ ముదిరాజ్ సంఘం సభ్యులు, పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఖానాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మా బోజ్జు పటేల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే కండులు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాలు పాలన చేసిన ఏ ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేదని, కాంగ్రెస్ పార్టీ గెలిచిన నాలుగు నెలల్లోనే ప్రజల కోసం ప్రవేశపెట్టిన ఆరుగ్యారంటీలలో మూడు గ్యారంటీలను అమలు చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుందని తెలిపారు. ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ ని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు .కార్యక్రమంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం, మండల అధ్యక్షులు దోనికెనీ దయానంద్, పట్టణ అధ్యక్షుడు నిమ్మల రమేష్, నాయకులు తోట సత్యం, జన్నరపు శంకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.