సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
కాంగ్రెస్ లో చేరిన రిటైర్డ్ అధికారులు
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని 11వార్డులో గురువారం ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మా బోజ్జు పటేల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో రిటైర్డ్ రెవెన్యూ ఎడి బుసాని గంగాధర్, సీఏసీఎస్, రిటైర్డ్ సీఈవో రజాగౌడ్, కర్ణ గంగ నర్సయ్య, గట్టు నర్సయ్యలు చేరారు. వీరికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రేఖ నాయక్ ,ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం, మండల అధ్యక్షులు దోనికెనీ దయానంద్, పట్టణ అధ్యక్షుడు నిమ్మల రమేష్, నాయకులు తోట సత్యం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.