Chada Venkat Reddy: భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్రదారులను తరిమికొట్టాలి : చాడ వెంకట్ రెడ్డి

సిరాన్యూస్, సైదాపూర్:
భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్రదారులను తరిమికొట్టాలి : చాడ వెంకట్ రెడ్డి
* కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిచాలి

భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్రదారులను తరిమికొట్టాలని, సీపీఐ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ పార్టీ మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి అన్నారు. శుక్ర‌వారం సైదాపూర్ మండల కేంద్రంలో సీపీఐ కరీంనగర్ జిల్లా కార్యవర్గ సభ్యులు బత్తుల బాబు ఆద్వ‌ర్యంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ఆతిథిగా సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తే దేశం అల్లకల్లోలంగా మారుతుందని, ముఖ్యంగా సామాన్య ప్రజలు ఈ దేశంలో జీవించే హక్కులు కోల్పోతారని అన్నారు. అదేవిధంగా దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని, భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ , ఇండియా కూటమి గెలిస్తేనే దేశంలో సామాన్య ప్రజలకు న్యాయం చేకురుతుందని అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఐ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుని అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంట్ కు పంపలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, బోయిని అశోక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండారపు శ్రీనివాస్, మిట్టపల్లి కిష్టయ్య, వేముల రమేష్ సీపీఐ సీనియర్ నాయకులు కంది రవీందర్ రెడ్డి, శ్రీనివాస్, సదానందం, సమ్మయ్య, రవి, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *