సిరాన్యూస్, కడెం
బీజేపీ, బీఆర్ఎస్ లను ఓడిద్దాం..ప్రశ్నించే గొంతుక సుగుణను గెలిపిద్దాం : వెడ్మ బొజ్జు పటేల్
* కాంగ్రెస్ పార్టీతోనే సబ్బండ వర్గాలకు న్యాయం
* కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ నాయకులు
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను ఓడిద్దాం, ప్రశ్నించే గొంతుక ఆత్రం సుగుణను గెలిపిద్దామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పదేళ్ళు అధికారంలో ఉండి పేద ప్రజల కోసం ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కడెం మండలంలోని యాదవ సంఘం అంబర్ పేట గ్రామ అధ్యక్షుడు పాక భూమన్న, మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు కొప్పుల నారాయణ,సంఘ సభ్యులు జిలి కొమరయ్య బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను వీడి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికి కండువా కప్పి పార్టీలో సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సబ్బండ వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమవుతుందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటేనని,ఆ పార్టీలను నమ్మి మోసపోవద్దన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుక ఈ ప్రాంత అభివృద్ధికై పోరాడే ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రేంకల రాజన్న, మాజీ ఎంపీటీసీ తిరుపతి, మాజీ సర్పంచ్ బొలిశెట్టి సత్తన్నా,మాజీ ఉపసర్పంచ్ బుచ్చన్న,రమేష్,శీను,రమేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు