సిరాన్యూస్, భీమదేవరపల్లి
వెలిచాల రాజేందర్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలి
* తెలంగాణ అంబేడ్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్
కరీంనగర్ ఎంపీగా వెలిచాల రాజేందర్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ అంబేడ్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్ అన్నారు. శుక్రవారం భీమదేవరపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతదేశంలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలను విడదీసి లబ్ధి పొందాలని చూస్తుందన్నారు. ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలు పక్కన పెట్టి దేశ సంపదను కార్పొరేషన్ శక్తులకు దోచిపెడుతుందన్నారు. జీఎస్టీ ద్వారా ప్రజల నుండి వేలకోట్లు పోగు చేసి జీడీపి పెరిగిందని ప్రపంచాన్ని తప్పుదోవ పట్టిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ రంగాలను ప్రైవేటు పరం చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవశాలు లేకుండా చేస్తుందని ప్రైవేట్ కంపెనీలో కూడా రిజర్వేషన్లు అమలు చేయవలసి ఉండగా ప్రభుత్వం వాటిపై చర్యలు తీసుకోకపోవడం వలన ఎస్సీ, ఎస్టీ ,బీసీలు నష్టపోయి బజారులో పడాల్సిన పరిస్థితి దాపురించిందని తెలిపారు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లను తొలగించి మనువాద రాజ్యాన్ని స్థాపించాలనే కుట్రలు చేస్తుందని చెప్పారు. భాజపా ప్రయత్నాలను అడ్డుకునే ఏకైక లౌకిక పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాజ్యాంగ హక్కులను కాపాడాలని ప్రజలు కోరుతున్నారన్నారు. కులం , మతం, దేవుళ్ళ పేర్లతో ప్రజలను విభజించి ఓట్లు అడుగుతున్న బీజేపీని ఓడించి తగిన బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో జేఏసీ కో.కన్వీనర్ ఉప్పుల కుమారస్వామి ,బుసమల్ల రాజు, గంగారపు రవి,గొర్రె ప్రభాకర్, మాడుగుల కర్ణాకర్, గిరిమల్ల సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.