సిరాన్యూస్, ఖానాపూర్
కాంగ్రెస్లో చేరిన మాజీ మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. సాయంత్రం ఖానాపూర్ ఎమ్మెల్యే కార్యాలయంలో అంకం రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.