సిరాన్యూస్, బోథ్
ఒక్క అవకాశం ఇవ్వండి .. జనం కోసం సేవ చేస్తా : బీఎస్పీ పార్లమెంట్ అభ్యర్థి మేస్రం జంగు బాబు
బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుంది
బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందని బీఎస్పీ పార్లమెంట్ అభ్యర్థి మేస్రం జంగు బాబు అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం పలు గ్రామాలలో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మేస్రం జంగుబాబు మీడియా తో మాట్లాడుతూ బిఎస్పీ పార్లమెంటు అభ్యర్థి గా పోటీ చేస్తూ న్నానని ప్రజలు ఆశీర్వాదించాలని కోరారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించినట్టే కాంగ్రెస్ పార్టీ నేడు కూడా వ్యవహరిస్తున్నదన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎన్నికైన తర్వాత వలసలను ప్రోత్సహించని రేవంత్ రెడ్డి నేడు పార్టీలను వివిధ పార్టీల నుంచి వచ్చిన వారిని చేర్చుకొని ప్రోత్సహిస్తున్నారన్నారు. కొంతమంది గోడ మీద పిల్లలు లాగా చొక్కా మార్చినంత సులువుగా పార్టీలు మారుతున్నారని తెలిపారు.ఎన్నికల వేళల్లో కొన్ని పెట్టుబడి మనువాదపార్టీలు డబ్బు సంచులతో,నోట్లకట్టలతో గెలవచ్చని అహంకారంతో ప్రజలకు దూరంగా ప్రజాసమస్యలు అవసరం లేనట్టుగా కొందరు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి చాలా కాలంగా బహుజన సమాజ్ పార్టీలో ఉన్నానని ప్రజల శ్రేయస్సు కొరకు నిరంతరం పని చేస్తానని మాకు ఒక్క అవకాశం ఇస్తే జనం మధ్యలో జనం కోసం సేవ చేస్తానని, బిఎస్పీ ని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్లమెంట్ ఇన్చార్జి అడ్వకేట్ జగన్మోహన్,ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు రత్నపురం రమేష్ , ఆదిలాబాద్ అసెంబ్లీ అధ్యక్షుడు శ్రీహరి, వెంకటేష్ ,గంగయ్య తదితరులు పాల్గొన్నారు.