సిరాన్యూస్, సైదాపూర్
వెలిచాల రాజేందర్ రావును భారీ మెజార్టీతో గెలిపించండి: పీఏసీఎస్ మాజీ ఛైర్మన్ సారబుడ్ల రాజిరెడ్డి
* వెన్నంపల్లిలో కాంగ్రెస్ నాయకుల గడపగడపకు విస్తృతస్థాయి ప్రచారం
కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలని వెన్నంపల్లి పీఏసీఎస్ మాజీ ఛైర్మన్ సారబుడ్ల రాజిరెడ్డి అన్నారు. శనివారం సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గడపగడపకు విస్తృతస్థాయి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. ఆరు గ్యారెంటీ ల ద్వారా ప్రజలు అన్ని రకాలుగా లబ్ధి పొందుతున్నారని, త్వరలోనే మహిళలకు నెలకు 2500 రూపాయలు , ప్రతి రైతుకు ఏకకాలంలో 2లక్షల రుణమాఫీ చేస్తారని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ఓటు వేస్తే అది వృధా అని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు మారపాక తిరుపతి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ పీఏసీఎస్ చైర్మన్ సారబుడ్ల రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొండాల్ రెడ్డి మాజీ ఎంపిటిసి పరకాల రమేష్, కాంగ్రెస్పార్టీ సీనియర్ నాయకులు కంది తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.