సిరాన్యూస్, ఇచ్చోడ
గొడం నగేష్ను భారీ మెజార్టీతో గెలిపిద్దాం: బీజేపీ జిల్లా అధ్యక్షులు పతంగి బ్రహ్మానందం
బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి గొడం నగేష్ను భారీ మెజార్టీతో గెలిపిద్దామని బీజేపీ జిల్లా అధ్యక్షులు పతంగి బ్రహ్మానందం అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం బోరిగామ, కామగిరి గ్రామాలలో శనివారం ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి గొడం నగేష్ను గెలిపించాలంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన పథకాలను ఓటర్లకు వివరించారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి నగేష్ మాట్లాడుతూ తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో ఇచ్చోడ మండల అధ్యక్షుడు కేంద్రే నారాయణ, గుమ్మడి భీమ్ రెడ్డి, కొల్లూరి చంద్రశేఖర్, బాబారావు పటేల్, అమ్టే, కామగిరి మాజీ సర్పంచ్ తొడసం భీమ్రావు, మొర నరసింహారెడ్డి, ఏనుగు విద్యాసాగర్ రెడ్డి డొల్ల ప్రదీప్, డొల్ల దిలీప్, సుంకరి రామస్వామి, సమ్మెట సత్యం నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.