సిరాన్యూస్, భీమదేవరపల్లి
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ను గెలిపిద్దాం
* గిరిజన బంజారా సంఘాల ఐక్యవేదిక నాయకులు
ప్రమాదంలో భారత రాజ్యాంగం ఉందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ గెలిపిద్దామని గిరిజన బంజారా సంఘాల ఐక్యవేదిక హుస్నాబాద్ నియోజక వర్గం నాయకులు అన్నారు. శనివారం భీమదేవరపల్లి మండలంలో వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడం జరిగిందన్నారు. గత 65 సంవత్సరాల 55 లక్షల కోట్ల అప్పులు చేస్తే 10 సంవత్సరాలలో 103 లక్షల కోట్ల అప్పులు చేసి ఆదానీ, అంబానీలకు దోచిపెట్టడం జరిగిందన్నారు. ఢిల్లీ పరిసరాలలో గిట్టుబాటు ధరల కోసం రైతులు ఉద్యమం చేస్తే రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చి 750 మంది రైతులను చంపడం అన్యాయమని, విధిలేని పరిస్థితుల్లో చట్టాలను రద్దు చేయడం జరిగిందన్నారు. ఈ మధ్యకాలంలో ముస్లింలకు హిందువులకు మధ్య ఘర్షణ వివాదాలకు తెరలేపడం ,రాజ్యాంగం మార్పు రిజర్వేషన్ల రద్దు లాంటి చర్యలు సమాజంలో అసమానతలను ఘర్షణలకు తావిచ్చి దానివల్ల సాధించింది ఏమీ లేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల అటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని, అలాగే కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈకార్యక్రమంలో ప్రొఫెసర్ వీరన్న నాయక్ గిరిజన మేధావుల ఫోరం కన్వీనర్, చెప్యాల ప్రకాష్ తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బాదావత్ వీరస్వామి కాంగ్రెస్ సీనియర్ నాయకులు, సిద్ధమల్ల వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, సిద్ధమల్ల కృష్ణ మాజీ ఉపసర్పంచ్, గుగులోత్ లక్ష్మణ్ నాయక్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కొంగొండ సమ్మయ్య, సిద్ధమల్ల రాజమౌళి, ఎర్రోజు సుభాష్,కిషన్ నాయక్, కంకల సురేష్, యూసఫ్, వెంకటేష్, రవి, శ్రీను తదతరులు పాల్గొన్నారు.