అభివృద్ధి పనులను నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం…

మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
 సిరా న్యూస్,సికింద్రాబాద్;
సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు కు మద్దతుగా సనత్ నగర్ లోని కేఎల్ఎన్వై పార్క్ లో ఎమ్మెల్యే తలసాని ప్రచారం నిర్వహించారు. తలసాని మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో ఎప్పుడూ జరగని అభివృద్ధి ని చేశాము. అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పద్మారావు గౌడ్ ను గెలిపించాలి. నియోజకవర్గ పరిధిలో కోట్లాది రూపాయల విలువైన అభివృద్ధి పనులు మంజూరైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 5 నెలలు దాటినా ఎలాంటి అభివృద్ధి లేదు. కేంద్రమంత్రి గా కిషన్ రెడ్డి అభివృద్ధి, ప్రజా సమస్యలను పట్టించుకోలేదు. మళ్లీ బీజేపీకి ఓటేసి నష్టపోవద్దని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *