Kushboo Gupta: ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వద్దు : ఎన్నికల అధికారి కుష్బూ గుప్త

సిరాన్యూస్, బోథ్‌
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వద్దు : ఎన్నికల అధికారి కుష్బూ గుప్త

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని బోతు నియోజక వర్గ ఎన్నికల అధికారి కుష్బూ గుప్త పేర్కొన్నారు. శనివారం బోథ్‌ లోని ఎన్నికల అధికారి కార్యాలయ ఆవరణలో ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి పలు సూచన చేశారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ఎన్నికల కోసం వినియోగించే వాహనాలను దుర్వినియోగం చేయవద్దు అన్నారు. దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వస్తే తగు చర్యలు తప్ప ఉన్నారు. పోలింగ్ స్టేషన్లో వరకు వెళ్లేందుకు రూట్ల‌లో రోడ్లకు అనుగుణంగా వాహనాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది అని పేర్కొన్నారు. ప్రతి ప్రభుత్వ అధికారి ఎన్నికల ఉద్యోగికి గుర్తింపు కార్డులను అందిస్తామన్నారు. గ్రామాలలో సిబ్బందికి భోజన సౌకర్యం అల్పాహారం కల్పిస్తామన్నారు. తీవ్రమైన ఎండలను దృష్టిలో ఉంచుకొని ఓ ఆర్ ఎస్ పాకెట్లను సిబ్బంది వెంటనే ఉంచుతామని సెల్ ఫోన్లను సైతం సిబ్బంది చార్జింగ్ పెట్టుకుని ఉండాలన్నారు .పోలింగ్‌ బూతులకు చేరే ఉద్యోగులకు ముందుగా ఆయా బూతులకు పంపించే ఏర్పాటు చేస్తామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద మంచినీటి వసతి, కూలర్లను సైతం ఏర్పాటు చేయాలని వివరించమన్నారు. అందుకు అవసరమైన నగదును సైతం ఇప్పించామన్నారు. వీధిలోకి వెళ్లే సిబ్బందికి ఏమైనా కష్టాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆమె పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లేవారు ఆదివారం ఉదయం 3 గంటల నుండి రిపోర్టు చేయాల్సి ఉంటుందన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తప్ప ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *