కిక్కిరిసిన రావులపాలెం జాతీయ రహదారి, బస్టాండ్

 సిరా న్యూస్,కొత్తపేట;
రాష్ట్రము, దేశం నలుమూలలు నుండి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలు స్వగ్రామాలు చేరుకుంటున్నారు. సోమవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గ్రామాలూ విడిచి ఉద్యోగ, వ్యాపార, విద్య, ఉపాధి నిమిత్తం దేశం లోని వివిధ ప్రాంతాలకు వెళ్లిన ప్రజలు, ఐదేళ్లు కు ఒక సారి వచ్చే ఎన్నికల్లో తమ నేతలకు ఓటు వేయడానికి సొంత ఊర్ల కు చేరుకుంటున్నారు. రావులపాలెం జాతీయ రహదారి పై ట్రాఫిక్ కిక్కిరిసిపోయింది. సొంత కార్ లు, బస్సు లు, హైటెక్ బస్సులు, ఎక్ష్ప్రెస్స్ బస్సులు లతో వేలాది వాహహాలతో ట్రాఫిక్ స్థంభింయింది. కొస్తా జిల్లాలనుంచి ఇక్కడ నుండి హైదరాబాద్ లో సెటిలర్ల కోసం నేతలు బస్సులను పంపిస్తున్నారు. శనివారం రాత్రి కి హైదరాబాద్ చేరుకొని ఆదివారం ఉదయం వారి ఓటర్ లతో అక్కడ బయలుదేరి సాయంత్రానికి చేరుకొనిటట్టు ఏర్పాటు చేసారు.
=======================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *