గజ్వేల్ లో బీఆర్ఎస్ రోడ్ షో

 సిరా న్యూస్,గజ్వేల్;
మెదక్ బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామారెడ్డికి మద్దతుగా గజ్వేల్ లో రోడ్ షోలో మాజీమంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు నిర్వహించారు. హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ వాళ్లు, బిజెపి వాళ్లు వచ్చి అబద్ధపు మాటలు చెప్పి వెళ్ళారు. వెంకట్ రామా రెడ్డి చెప్పినవి చేస్తా అని కుటుంబం మీద ఒట్టు వేశారు.పేదలకు విద్య, ఉపాధి కల్పన, ఉద్యోగ శిక్షణ, 10 లక్షల ప్రమాద బీమా, ఉచితంగా ఫంక్షన్ హాళ్లు తెస్తా అంటున్నాడు.మంచి వ్యక్తి ఆలోచించి ఓటు వేయండి వెంకటరామరెడ్డిని గెలిపించండి. గజ్వేల్ రూపురేఖలు మార్చింది కేసీఆర్. తెలంగాణ ప్రదాత మాత్రమే కాదు. గజ్వేల్ నవనిర్మాత మన కేసీఆర్..అన్ని గజ్వేల్ కేనా అన్న వాళ్లు. సిగ్గులేకుండా వస్తున్నారు. ఓట్లు అడుగుతున్నారు.బిజెపి అభ్యర్థి ఎలా వస్తున్నాడు. ఎలా ఓట్లు అడుగుతున్నాడు.గజ్వేల్ అభివృద్ధిని అడ్డుకున్న వాళ్లకు, అభివృద్ధి చేసిన వాళ్లకు మధ్య ఈ ఎన్నిక జరుగుతున్నది. దుబ్బాకలో ఎమ్మెల్యేగా గెలిచాక ఒక్క పని చేయలేదు. దుబ్బాకలో పని చేయని రఘునందన్ మెదక్ పార్లమెంట్ లో ఎలా పని చేస్తారు. ఎలా చల్లుతారు.ఇంటికొక క్యాలెండర్ పంచితే ఆ క్యాలెండర్లు కడుపు నింపుతాయా. బిజెపి పేదల వ్యతిరేక పార్టీ కర్షకుల వ్యతిరేక పార్టీ. నిత్యవసర సరుకుల ధరలు పెంచి సామాన్యుడిని నడ్డి విరిచింది బిజెపి. రేవంత్ రెడ్డి అలవి గాని హామీలు ఇచ్చి చేతులెత్తేశాడు. రుణమాఫీ, పింఛన్లు, మహాలక్ష్మి, తులం బంగారం ఇలా అన్ని ఉత్త మాటలే అయ్యాయి.కాంగ్రెస్ గాడిద గుడ్డు ఇచ్చింది.కాంగ్రెస్ వచ్చింది నీటి కొరత కరెంటు కోతలు మొదలైంది. కాంగ్రెస్ వచ్చాక గజ్వేల్ లో 150 కోట్ల పనులు ఆపేసింది. ఇచ్చిన హామీలు ఏమయ్యాయని కేసీఆర్ నిలదీస్తే..రేవంత్ రెడ్డి కేసీఆర్ పై అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. మన కేసీఆర్ ని అలా తిడితే ఊరుకుందామా.. మీ ఓటుతో ఆ రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పాలని కోరుతున్నా. వడ్ల కొనుగోలులో తరుగు పెడుతున్న కాంగ్రెస్కు ఓట్లలో మనం తరుగు పెట్టాలి. ఆర్ అండ్ ఆర్ కాలనీలో మిగిలిపోయిన పనులు పూర్తి చేసే బాధ్యత ఆయనదే. కెసిఆర్ గారు కూడా గొప్ప యాదాద్రి నిర్మించారు కానీ ఓట్ల కోసం ఏనాడు ఆ గుడి గురించి మాట్లాడలేదు. బిజెపి మాత్రం అభివృద్ధి గురించి మాట్లాడకుండా మత రాజకీయాలు చేస్తున్నది.
ఈవీఎం మీద నాలుగు నెంబరు కారు గుర్తుపై ఓటు వేసి వెంకటరామరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు.

ఎంపి అభ్యర్థి వెంకటరామరెడ్డి మాట్లడుతూ 11 సంవత్సరాలు ఉమ్మడి మెదక్ జిల్లాలో పీడీగా, జాయింట్ కలెక్టర్ గా, కలెక్టర్ గా వివిధ హోదాల్లో మీకు సేవ చేసే భాగ్యం కలిగింది. మీ ఆదరణను, ఆప్యాయతను ఎప్పటికీ మరిచిపోలేను. మీ సేవకుడిగా, మీలో ఒకడిగా ఉండాలని మీ ఆశీర్వాదం కోరుతూ మెదక్ ఎంపీగా మీ ముందుకు వస్తున్నాను. ఉమ్మడి మెదక్ ప్రజల రుణం తీర్చుకోవాలనే సదుద్దేశ్యంతో, నా ఉమ్మడి కుటుంబ ఆస్తి నుంచి రూ. 100 కోట్లతో వెంకటరామ రెడ్డి ట్రస్టు ద్వారా సేవలందిస్తాను. పేద పిల్లలకు విద్య, ప్రభుత్వ ఉద్యోగాల శిక్షణ, యువతకు స్కిల్ డెవలప్మెంట్, మహిళా సాధికారత కోసం కార్యక్రమాలు నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నిబద్ధత కలిగిన అధికారిగా, పేదలకు సేవ చేసిన వ్యక్తిగా ఉమ్మడి మెదక్ ప్రజలకు నా జీవితం తెరిచిన పుస్తకం. మరోసారి మీకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని, మీ ఎంపీగా నన్ను దీవించాలని చేతులు జోడించి ప్రార్థిస్తున్నానని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *