సిరా న్యూస్,ఒంగోలు;
ఎన్నికల నిర్వహణలో భాగంగా మూడో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను జనరల్ అబ్జర్వర్ల సమక్షంలో కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి .ఏ.ఎస్. దినేష్ కుమార్ శనివారం ప్రకాశం భవనములో నిర్వహించారు. పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహించడానికి ఇప్పటికే పీ.ఓ.లు, ఏ.పీ.ఓ.లు, ఓ.పి.ఓ.లతో ప్రత్యేక టీములను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ టీములను పోలింగ్ కేంద్రాల వారీగా కేటాయించడానికి ఈ మూడో విడత ర్యాండమైజేషన్ నిర్వహించారు. దీని ప్రకారమే డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి వీరికి పోలింగ్ సామాగ్రి ఇచ్చి ఆయా పోలింగ్ కేంద్రాలకు పంపిస్తారు. ఈ కార్యక్రమంలో జనరల్ అబ్జర్వర్లు . అరవింద్ కుమార్ చౌరాసియా, .మయూర్ కె. మెహతా, డిఆర్ఓ ఆర్.శ్రీలత, ఇతర అధికారులు పాల్గొన్నారు.