సిరాన్యూస్, ఆదిలాబాద్
రాష్ట్రంలో మళ్లీ హిందువులపై దాడులు : ఎమ్మెల్యే పాయల్ శంకర్
* రిమాండ్లో ఉన్న స్వాములను పరామర్శించిన ఎమ్మెల్యేలు
రాష్ట్రంలో మళ్లీ హిందువులపై దాడులు మొదలయ్యాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గల సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న స్వాములను నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేళ్ళతో ఎమ్మెల్యే పాయల్ శంకర్ కలిసి వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భైంసా లో జరిగిన సంఘటనకు బాధ్యులను చేస్తూ హనుమాన్ దీక్షలో ఉన్న స్వాములను అరెస్టు చేసి రిమాండ్కు పంపించడం చూస్తుంటే హిందువులపై భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అక్కసును వెళ్లగకుతుందో అర్థం అవుతుందని అన్నారు. రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ కు శాంతియుతంగా నిరసన తెలుపుతుండగా వేరే వర్గానికి చెందిన కొందరు దుండగులు టమాటాలతో కేటీఆర్ పై చేసిన దాడికి బాద్యులను చేస్తూ అక్రమంగా కేసులు బానాయించారని అన్నారు. ఎన్నికలు అయిన వెంటనే ఈ విషయంపై భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందని అన్నారు.