Minister Sitakka: ఎంపీగా ఆత్రం సుగుణను గెలిపించాలి: మంత్రి సీతక్క

సిరాన్యూస్,ఇచ్చోడ
ఎంపీగా ఆత్రం సుగుణను గెలిపించాలి: మంత్రి సీతక్క
* బోరిగామలో ఇంటింటా ప్ర‌చారం

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి అనసూయ సీతక్క అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని బోరిగామ గ్రామంలో శ‌నివారం ఇంటింటా ఎన్నికల ప్రచారంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ముందుగా మంత్రి సీతక్క దాదాసాహెబ్ అంబేద్కర్, మలిదశ తెలంగాణ అమరవీరుడు ఏనుగు భూమా రెడ్డి విగ్రహాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి సుగుణ ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకొని ప్రజాసేవ చేసేందుకు ముందుకు వచ్చిందని, ఆదివాసి గిరిజన బిడ్డను తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిఆడే గజేందర్, మాజీ ఏఐసిసి మెంబర్ నరేష్ జాదవ్, నాయకులు మహమూద్ ఖాన్, ఆసిప్ ఖాన్, ప్రవీణ్ రెడ్డి, నారాయణరెడ్డి, ముస్తఫా, బాబా, లక్ష్మణ్, నాగన్న శంకర్, ముత్యం రెడ్డి, నారాయణరెడ్డి, ఫారుక్, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *