సిరాన్యూస్,గుడిహత్నూర్
తిరిగి సొంత గూటికి చేరిన బీఆర్ ఎస్ శ్రేణులు
మోసపూరిత హామీలను నమ్మే స్థితిలో లేము : మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల్ గౌడ్
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రానికి చెందిన పీఏసీఎస్ S డైరక్టర్ అప్కామ్ స్వామి, యాదవ సంఘo మండల అధ్యక్షులు అప్కామ్ పోచన్నఇటీవల బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి నగేష్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరారు.చేరిన రెండు రోజుల్లోనే బీజేపీ పార్టీ చెప్పే కుట్ర పూరిత రాజకీయనాలు గ్రహించారు. బీఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల్ గౌడ్ ఆధ్వర్యంలో గులాబీ కట్టుకొని సొంత పార్టీ కి చేరారు.ఈ సందర్భంగా తిరుమల్ గౌడ్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ చేసే మోసపూరిత కుట్ర పూరిత రాజకీయాలను ఎవ్వరు నమ్మే స్థితిలో లేరని,దానికి ఇదే నిదర్శనం అని అన్నారు.రేపు జరగబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిపారు. బీఆర్ ఎస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సక్కు నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, ఆత్రం సక్కును భారీ మెజారిటీతో గెలిపించి , మా అధినేత కెసిఆర్ కి బహుమతిగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.మా విజయం ఎప్పుడో ఖరారు అయ్యిందని, భారీ మెజారిటీ కోసమే మా ప్రయత్నం అని ధీమా వ్యక్తం చేశారు.కార్యక్రమంలో ఎంపీటీసీ షాగీర్ ఖాన్ , సీనియర్ నాయకులూ జేబీ నాయక్ రంగు శ్రీనివాస్ గౌడ్, ప్రకాష్, దోమకొండ సుధాకర్ , సదానంద్ , అలీం తదితరులు పాల్గొన్నారు.