Rishitha Reddy: లక్మీ చారిటబుల్ ట్రస్ట్, రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రిషిత రెడ్డికి ఘన సన్మానం

సిరా న్యూస్, చిగురుమామిడి:

లక్ష్మి చారిటబుల్ ట్రస్ట్, రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రిషిత రెడ్డికి ఘన సన్మానం…

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం గునుకులపల్లి గ్రామానికి చెందిన కొమ్మేర రిషిత రెడ్డిని లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్, ఇందుర్తి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘంగంగా సన్మానించారు. ఆదివారం ఈ మేరకు విద్యార్థినికి శాలువా కప్పి పూలమాలతో పాటు పుష్ప గుచ్చం అందజేసి, అభినందనలు తెలిపారు. అనంతరం లక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, సీనియర్ జర్నలిస్ట్ గాదె రఘునాథ్, రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు కంది రాజశేఖర్ రెడ్డిలు మాట్లాడుతూ… చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ నిరుపేద రెడ్డి కుటుంబానికి చెందిన కొమ్మెర రిషిత 10/10 జీపీఏ సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మారుమూల గ్రామంలో చదువుకుంటూ రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించడం అభినందనీయమని అన్నారు. రిషిత రెడ్డిని ఉన్నత చదువులకు రెడ్డి సంక్షేమ సంఘంతో పాటు లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక తోడ్పాటును అందిస్తామని అన్నారు. అనంతరం ఆమె తండ్రి కొమ్మెర శ్రీనివాస్ రెడ్డి ని సైతం సన్మానించి, అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం నాయకులు కాంతాల శ్రీనివాస్ రెడ్డి, కొమ్మెర మహేందర్ రెడ్డి, గునుకుల రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ముచ్చంతల వెంకట్ రెడ్డి, గ్రామస్తులు పోతరవెని లింగం, కున సంతోష్, చెప్పాయల మురళి, కత్తి స్వామి, భరత్, యాదయ్య, చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *