సిరాన్యూస్, గుడిహత్నూర్
డోoగర్గావ్ పోలింగ్ బూత్ను సందర్శించిన తహసీల్దార్ కవిత రెడ్డి
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని డోoగర్గావ్ గ్రామంలో పోలింగ్ బూత్ ని గుడిహత్నూర్ తహసీల్దార్ కవిత రెడ్డి సోమవారం సందర్శించారు. ఈసందర్బంగా తహసీల్దార్ కవిత రెడ్డి మాట్లాడుతూ పోలింగ్ బూత్ లో ఎలాంటి సమస్య ఉన్న తనకు నేరుగా తెలపాలని, పోలింగ్ శాతం ఎంత నమోదు అయ్యిందో తెలపాలని పీఓ ఆనంద్ రావ్, ఏపిఓ స్వామి, ఓపిఓ ప్రవీణ్ కుమార్, బీఎల్ఓ గజభారే విద్యాసాగర్ లకు తెలియ జేశారు.