సిరాన్యూస్, ఖానాపూర్
ఒడ్డేవాడలో ఓటేసిన నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సోమవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం శాంతి నగర్ లోని ఒడ్డేవాడలోని 237 బూత్ లో బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ తప్పకుండా వినియోగించుకోవాలని కోరారు.