సిరాన్యూస్, భీమదేవరపల్లి
సేవే పరమావధి.. అవార్డుల వారధి
* వైద్య రంగంలో విశిష్ట సేవలు
* వైద్యరంగంలో 31 సంవత్సరాలు అనుభవం
* ‘మహ్మద్ శుక్ర ‘సర్వీస్ అభినందనీయం
* తనకంటూ ప్రత్యేక గుర్తింపు
* కలెక్టర్ చేతుల మీదిగా 6 అవార్డులు, రాష్ట్రపతి చేతుల మీదుగా నైటింగేల్ అవార్డు
ఇతరులకు సేవల చేయాలన్న తపన ఉంటే దాని సాధించడం కోసం ఎంతో కష్టపడతారు. అలాగే ఆడవాళ్ళు చదువుకుంటే ఎన్ని అధ్బుతాలు చేయవచ్చుఅని కూడా నిరూపిస్తున్నారు భీమదేవరపల్లిలోని ఏఎన్ఎం మహ్మద్ శుక్ర …. నేటి మహిళల జీవితానికి తన కథ ఒక ఆదర్శం. భీమదేవరపల్లి మండలంలోని కొత్తపెళ్లి గ్రామానికి చెందిన మొహమ్మద్ శుక్ర నేటి మహిళల లోకానికి తన కథ ఒక జీవితం…. 1993లో ఏఎన్ఎం గా రామారం, గండిపల్లి, పోతారం, దొంగల గూడెం వంటి ఆరు గ్రామాలు, 23 తండాలను కలుపుకొని, హుస్నాబాద్ ఆరోగ్య కేంద్రం కింద విధులు నిర్వహించేది. సరిగ్గా రోడ్డు బాట కూడా లేని తండాలకు నాలుగు నుండి ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి సర్వీస్ చేసేది. ఆనాటి కాలంలో అక్కడి ప్రజలకు ప్రభుత్వానికి కేంద్రంపై ఎలాంటి అవగాహన లేకపోయినా, ఆరోగ్య కేంద్రం వల్ల ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాలను తెలియజేస్తూ, తండలో ఒక ఇంటి బిడ్డ అయి, వారికి వివిధ రకాల సేవలు అందించింది. సుమారుగా కాలినడకన విధులు నిర్వహిస్తు16 సంవత్సరాల పాటు సేవలందించింది. అప్పటికే ఆధునిక ప్రావీణ్యం చెందిన ఆరోగ్య కేంద్రాలు రూపుదిద్దుకోవడంతో 2009వ సంవత్సరంలో ముల్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బదిలీ పై వెళ్ళింది. వివిధ గ్రామాలలో సేవలందించిన తనకి కలెక్టర్ చేతుల మీదుగా 5 అవార్డులు అందుకుంది. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి, ప్రతి ఇంటింటికి తిరుగుతూ కరోనా వ్యాధిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను గ్రామస్తులకు తెలుపుతూ కావాల్సిన వైద్యం మందులను సరఫరా చేస్తూ విధులు నిర్వహించింది. తను చేసిన సేవలను గుర్తు చేసిన ప్రభుత్వం 2020వ సంవత్సరంలో నైటింగేల్ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందించింది. దాదాపుగా వైద్యరంగంలో 31 సంవత్సరాలు సేవలందిస్తున్న ఇంతవరకు ప్రమోషన్ పేరు లేదు.అనేక లోటుపాట్లను ఎదుర్కొంటూ, ప్రజలకు ఉత్తమ సేవలందించడమే తన నైజం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహమ్మద్ శుక్రా జీవితాన్ని నేటి మహిళా సమాజం ఆదర్శంగా తీసుకోవాలని పలువురు కోరుకుంటున్నారు.