సిరా న్యూస్,సిద్దిపేట;
సిద్దిపేట పట్టణంలోని భారత్ నగర్ అంబిటస్ స్కూల్ లో 114పోలింగ్ బూత్ లో మాజి మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కుటుంబ సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ నేను కుటుంబ సభ్యులతో కలిసి భారత్ నగర్ లో ఓటు హక్కును వినియోగించుకున్నా. రాష్ర్ట వ్యాప్తంగా ముమ్మరంగా ప్రజలు పోలింగ్ లో పాల్గొంటున్నారు. గతంలో కంటే ఎక్కువ పట్టణాలలో పోలింగ్ పెరుగుతుంది. ప్రశ్నించే గొంతుక ఉండలని ప్రజలు ఆలోచిస్తున్నారు. మేధావులు,విద్యావంతులు పోలింగ్ లో పాల్గొనాలి. ప్రజాస్వామ్యం బలపడలంటే అందురు ఓటింగ్ లో పాల్గొనాలి. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం భారత్ దేశం. గత పార్లమెంటు ఎన్నికలలో కంటే పోలింగ్ శాతం పెరుగుతుంది. ప్రజలు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకువాలని అన్నారు.