మంథని పట్టణంలో ఓటింగ్ సరళిని పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు

 సిరా న్యూస్,మంథని;

పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా మంథని మున్సిపల్ పరిధిలోని పలు వార్డులోని పోలింగ్ బూతుల్లో వోటింగ్ సరళిని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ లు సోమవారం పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను,ఓటర్లను, కార్యకర్తలను కలిసి చేతి గుర్తుకు ఓటు వేయాలని పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అభ్యర్తించారు. ఏడవ వార్డు పరిధిలోని పోలింగ్ బూత్ 91,93 లలో జరుగుతున్న ఓటింగ్ సరళి పై మాజీ ఉపసర్పంచ్, డిసిసి అధికార ప్రతినిధి ఇనుముల సతీష్ తో మంత్రి శ్రీధర్ బాబు కాసేపు ముచ్చటించారు. అదేవిధంగా అంబేద్కర్ చౌరస్తాలో పాన్ షాప్ వద్ద మంత్రి శ్రీధర్ బాబు కాసేపు ఆగి ప్రజలతో ముచ్చటించారు.
==============================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *