ఓటు వేసేందుకు స్పెషల్ ట్రైన్లో వస్తున్న ఓటర్లు
సిరా న్యూస్,విశాఖపట్నం;
విశాఖ ఓటర్లు వస్తున్న నాగవళి నాందేడ్ స్పెషల్ ట్రైన్ ఆలస్యంగా రావడం వారిలో అందోళన కలిగించింది. ఉదయం 6 చేరాల్సిన ట్రైన్ సుమారుగా 5 గంటలు ఆలస్యంగా నడుస్తోంది. ప్రతి చోట టెక్నికల్ సమస్య అంటూ నిలిపివేస్తున్నారు. అధికారులు సమాధానం చెప్పడం లేదు. తమ ఓటు వృధా ఆవుతుందని ఆవేదన, అధికారులు పట్టించుకుని, సకాలం గమ్యాన్ని చేర్చాలని, లేదంటే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని వీడియో సందేశం ద్వారా వినతి చేస్తున్నారు.