పట్టణాల్లో టీడీపీ… గ్రామాల్లొ వైసీపీ

సిరా న్యూస్,ఏలూరు;
ఏపీలో పోలింగ్ చురుగ్గా సాగుతోంది. మధ్యాహ్నం రెండు గంటల సమయానికి 50 శాతానికి దాటింది. ఇంకా మూడు గంటల వ్యవధి మాత్రమే ఉంది. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కు సమయం ఉంది. అయితే ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ కేంద్రాలకు ఓటర్ల రాక ప్రారంభమైంది. ఎక్కడికక్కడే ఓటర్లు క్యూలో నిలుచొని వేచి ఉండడం కనిపించింది.అయితేగ్రామాల్లో మహిళలు పెద్ద ఎత్తున పొట్టేత్తడం విశేషం. అటు పట్టణ ప్రాంతాల్లో యువత, మహిళలు క్యూ లైన్లలో బారులు తీరారు.అయితే ఉదయం 11 గంటల సమయానికి కేవలం ఓటింగ్ 10 శాతం మాత్రమే ఉంది. మండే ఎండలు ఒక వైపు, నెమ్మదిగా పోలింగ్ జరగడం మరోవైపు ఓటింగ్ శాతం పై పడింది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటర్లు బారులు తీరడం మాత్రం విశేషం. అయితే గ్రామీణ ప్రాంతాల్లో వైసిపి, అర్బన్ ప్రాంతాల్లో టిడిపి హవా కనిపించింది. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులు అధికంగా ఉంటారు. వీరికి గత ఐదు సంవత్సరాలుగా సంక్షేమ పథకాలు అందడంతో.. తప్పకుండా వైసీపీని ఆదరిస్తారని ఆ పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. అర్బన్ ప్రాంతాల్లో మాత్రం టిడిపి కూటమిదే స్పష్టమైన ఆధిక్యం అని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు.అయితే సాధారణంగా ప్రతి నియోజకవర్గంలో పట్టణ ప్రాంతంలో ఓటర్లు అధికంగా ఉంటారు. ప్రతి నియోజకవర్గంలో నాలుగు మండల కేంద్రాలు, మరి ఐదు వరకు మేజర్ పంచాయతీలు, ఆపై ఒకటి రెండు మున్సిపాలిటీలు తప్పనిసరిగా ఉంటాయి. అక్కడ మాత్రం టిడిపి కూటమికి ఓట్లు అధికంగా పడే అవకాశం ఉంది. విద్యాధికులు, ఉద్యోగ, ఉపాధ్యాయులుఎక్కువగా ఉన్న తరుణంలో.. వారంతా టిడిపి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.దీనికి తోడు నిత్యవసరాల ధరలు, పన్నులు,చార్జీల పెంపు వంటి అంశాలుప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే వైసీపీ సర్కార్ మహిళల పేరిట పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేయడం, ఇప్పుడు ఎన్నికల్లో వారే ఉత్సాహంగా ఓటు వేయడానికి ముందుకు రావడం చూస్తుంటే వైసీపీకి కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది. మరి ఓటర్లు ఏ విధంగా తీర్పు ఇచ్చారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *