హిందువుల సంఖ్య తగ్గుతోందా

సిరా న్యూస్;

భారత జనాభాలో హిందువుల శాతం క్రమంగా తగ్గుతోందా.. అంటే అవుననే అంటున్నారు. ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి(ఈఏసీ–పీఎం) తెలిపింది. భార‌త్‌లో హిందువుల జ‌నాభా త‌గ్గుతూ ఉండ‌గా, మ‌రోవైపు బౌద్ద‌, సిక్కు, ముస్లిం, క్రిస్టియ‌న్ మైనార్టీల జ‌నాభా పెరుగుతూ పోయింది. ఇక పార్సీలు, జైనులు జ‌నాభా కూడా త‌గ్గింది. స‌మీప మిత్ర దేశాల్లో మెజారిటీ మ‌త‌స్తుల సంఖ్య పెరుగుతుండ‌గా, భార‌త్‌లో మాత్రం ఆ జ‌నాభా త‌గ్గిన‌ట్లు రిపోర్టులో తెలిపారు.1950లో మన దేశంలో హిందువులు దేశ జనాభాలో 84.68 శాతం ఉండగా, 2015 నాటికి ఇది 78.06 శాతానికి క్షీణించిందని వెల్లడించింది. అంటే హిందువుల వాటా జనాభాలో 7.82 శాతం తగ్గిందని పేర్కొంది.ఇదే సమయంలో భారత దేశ జనాభాలో ముస్లింల శాతం పెరిగింది. 1950 భారత జనాభాలో 9.84 శాతం ఉన్న ముస్లిం జనాభా.. 2015 నాటికి 14.09 శాతం పెరిగినట్లు పేర్కొంది. ముస్లిం జనాభాలో పెరుగుదల పరిశీలిస్తే 43.15 శాతంగా నమోదైనట్లు వివరించింది. ఇక 1950–2015 మధ్య క్రైస్తవులు, సిక్కుల వాటా స్వల్పంగా పెరిగిందని తెలిపింది. జైనులు, పార్శీల శాతం తగ్గిందని వెల్లడిచింది. సమాజంలో భిన్నత్వాన్ని పెంపొందించేందుకు వీలుగా ఉన్న అనుకూల వాతావరణాన్ని ఈ మార్పులు సూచిస్తున్నాయని అభిప్రాయపడింది.ఇక జనాభా హెచ్చుతగ్గుల్లో మార్పులకు కొన్ని కారణాలను సలహా మండలి స్పష్టం చేసింది. విధానపరమైన చర్యలు, రాజకీయ నిర్ణయాలు, సామాజిక ప్రక్రియలు సమాజంలో జనాభా హెచ్చు తగ్గులకు కారణమవుతాయని తెలిపింది. శామికా రవి నేతృత్వంలోని ఈఏసీ–పీఎం ప్రపంచ వ్యాప్తంగా 167 దేశాల్లో పరిస్థితులను అధ్యయనం చేసి ఈమేరకు నివేదికను రూపొందించింది. ఆయా వర్గాల జనాభా నిర్ధిష్టంగా ఎంద ఉందన్నది మాత్రం నివేదికలో పేర్కొనలేదు.తాజా నివేదిక ప్రకారం దక్షిణాసియాలోని బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక, భూటాన్, ఆఫ్గానిస్థాన్‌ వంటి భారత పొరుగు దేశాల్లో మాత్రం ఆయా దేశాల్లోని మెజారిటీ మతస్థుల జనాభా శాతం పెరుగుతున్నట్లు నివేదిక తెలిపింది. మైనార్టీల వాటా గణనీయంగా తగ్గినట్లు పేర్కొంది. 1950–2015 మధ్య మాల్దీవులు మినహా అన్ని ముస్లిం మెజార్టీ దేశాల్లోనూ మెజార్టీ వర్గం ప్రజల వాటా పెరిగింది. మాల్దీవుల్లో మెజార్టీ వర్గంగా ఉన్న షఫీ సున్నీల వాట 1.47 శాతం తగ్గింది. బంగ్లాదేశ్‌లో మెజార్టీ మతస్తుల వాటా 18 శాతం పెరిగింది. భారత ఉపఖండంలో ఇదే అత్యధిక పెరుగుదల. మన దాయాది దేశం పాకిస్థాన్‌లో మెజార్టీ వర్గమైన హనాఫీ ముస్లింల వాటా 3.75 శాతం పెరిగినట్లు నివేదిక పేర్కొంది. మొత్తంగా ఆదేశ జనాభాలో ముస్లింల వాటా పరంగా పెరుగుదల 10 శాతం నమోదైంది. ముస్లిమేతరులు మెజారిటీ వర్గాలుగా ఉన్న దేశాల్లో మయన్మార్, భారత్, నేపాల్‌లో మాత్రం మెజారిటీ మతస్థుల వాటా తగ్గిందని పేర్కొంది. ఇక అధిక ఆదాయం ఉన్న 35 దశాల్లో మెజార్టీ మతస్థుల వాటా సగటున 29 శాతం క్షీణించింది. ప్రపంచ సగటు(22శాతం)తో పోలిస్తే ఇది ఎక్కువ.950 సంవ‌త్స‌రంలో భార‌త్‌లో హిందువుల‌ జ‌నాభా 84.68 శాతం ఉండ‌గా, 2015 నాటికి ఆ సంఖ్య 78.06 శాతానికి చేరుకున్న‌ట్లు రిపోర్టులో వెల్ల‌డించారు. మ‌రో వైపు గ‌డిచిన 65 ఏళ్ల కాలంలో ముస్లిం జ‌నాభా మాత్రం 9.84 శాతం నుంచి 14.09 శాతానికి పెరిగింద‌ని స్ట‌డీలో పేర్కొన్నారు. మ‌య‌న్మార్‌లో హిందువుల జ‌నాభా ప‌ది శాతం పడిపోయింది. నేపాల్‌లో కూడా హిందువుల సంఖ్య 3.6 శాతం త‌గ్గిన‌ట్లు తెలిపారు.ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కేంద్రంపై మరోసారి విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి ఆర్థికవ్యవహారాల సలహా మండలి(ఈఏసీ–పీఎం) నివేదికలోని గణాంకాలపై తేజస్వీ యాదవ్‌ సందేహం వ్యక్తంచేశారు. తాజాగా జనగణన చేపట్టకుండానే దేశంలో హిందూ, ముస్లింల జనాభాపై కేంద్రం ఎలా ఒక అంచనాకు వస్తుందని ప్రశ్నించారు. దేశంలో ముస్లింల జనాభా పెరిగిందని, హిందువుల జనాభా తగ్గిందంటూ విడుదలచేసిన ఈఏసీ–పీఎం రిపోర్ట్‌పై ఆయన స్పందించారు. ‘‘ అసలైన సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే హిందూ, ముస్లింల మధ్య మోడీ సర్కార్‌ చిచ్చుపెడుతోంది. జనాభా లెక్కలు లేకుండానే ఎలా ఈ కొత్త లెక్కలతో వచ్చారు.? 2021లో కూడా జనగణన ఎందుకు సాధ్యంకాలేదు. అప్పుడు, ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు కదా. హిందూ, ముస్లింలను వేర్వేరుగా పక్షపాత ధోరణితో చూసే విధానాన్ని మానుకోండి. సమస్యల గురించే మాట్లాడండి’ అని తేజస్వీ హితవు పలికారు.

====================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *