సిరాన్యూస్, చిగురుమామిడి
చిగురుమామిడిలో 77.45 శాతం పోలింగ్
*ముల్కనూర్, సీతారాంపూర్ గ్రామాల్లో మొరాయించిన ఈవీఎంలు
* గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తగ్గిన పోలింగ్ శాతం
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో సోమవారం జరిగిన లోక్ సభ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ శాతం 77.45శాతంగా నమోదయింది. 40 కేంద్రాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో పోలింగ్ జరిగింది. 33,822 ఉంది ఓటర్లు ఉండగా 26,195 మంది ఓటు వేశారు. చిన్న ముల్కనూరు, సీతారాంపూర్ గ్రామాల్లో పోలింగ్ ప్రారంభమైన గంట పాటు ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు ఇబ్బంది పడ్డారు. వాటిని మళ్లీ సవరించడంతో ఓటింగ్ జరిగింది. ఎన్నికల కోసం మండలం మొత్తంగా నాలుగు సెంటర్లు గా విభజించి ఒక్కో విభాగానికి మండల స్థాయి అధికారులతో పాటు 160 మంది సిబ్బందిని నియమించారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి ప్రజలు ఆసక్తి చూపలేదు. తీవ్రమైన ఎండలు, వేసవి సెలవులకు బంధువులకు వెళ్లడం, తమకు ఎవరూ డబ్బులు ఇవ్వలేదని ఎందుకు ఓటు వేయాలని పలు కారణాలతో ఓటింగ్ శాతం తగ్గినట్లు తెలిసింది. రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండల కేంద్రంలో సమావేశంలో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి తన స్వగ్రామ మైన రేకొండలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కుమార్ మండలంలో పర్యటించి ఓటింగ్ సరళిని తెలుసుకున్నారు. మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు.