సిరాన్యూస్, ఓదెల
ఉప ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి జిల్లా కేంద్రానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు మంగళవారం పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ఘన స్వాగతం పలికారు. మంథని పర్యటన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి జిల్లా కేంద్రానికి వచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.