సిరా న్యూస్,అమలాపురం;
అమలాపురం పట్టణంలోని మోబర్లీపేట వద్ద మంగా బాలయోగిపై కోండ్రు కోటేశ్వరరావు హత్యాయత్నం చేసాడు. స్థానికులు అడ్డుకోవడంతో మంగం బాలయోగి, ఆయన మనవరాలు చొప్పెల గుణశ్రీ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. హత్యాయత్నాకి పాల్పడిన కోండ్రు కోటేశ్వరరావుకు స్థానికులు దేహశుద్ది చేసారు. కొంతకాలంగా సమనస గ్రామానికి చెందిన కోండ్రు వెంకటేశ్వరరావు, మంగా బాలయోగి కుటుంబాల మధ్య సరిహద్దు వివాదం నడుస్తోంది. గతంలో కోండ్రు వెంకటేశ్వరరావు భార్యను అమలాపురం కాటన్ పార్కు రోడ్డులో మంగా బాలయోగి హతమార్చాడు. పోలీసులు క్షతగాత్రులను అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
===================