పాజిటివ్ ఓటుతో జగన్ సీఎం కావడం ఖాయం
ప్రభుత్వ వ్యతిరేక ఓటే లేదు… ఇక చీలిక ఎక్కడ? కలయిక ఎక్కడ?
– కదిలొచ్చిన వృద్ధులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు
మంత్రి అంబటి స్పష్టీకరణ
అండ్ ఆర్డర్లో పోలీసులు అట్టర్ ఫెయిల్యూర్
– రాష్ట్రంలో చెలరేగిన హింసపై ఎన్నికల సంఘం సమీక్ష చేయాలి
– పల్నాడులో ఎన్నడూలేనంతగా హింస జరగడం బాధాకరం..
– అధికారంలో ఉండికూడా మా వర్గంపై జరిగిన దాడుల్ని అడ్డుకోలేకపోయాం..
– ఎవరెన్ని కుట్రలు చేసినా ఎన్నికల అంతిమ
తీర్పు వైఎస్ఆర్సీపీకే అనుకూలం
ః పోలీసుల తీరుపై మంత్రి అంబటి ఫైర్
సిరా న్యూస్,సత్తెనపల్లి ;
సత్తెనపల్లిలోని మంత్రి గారి క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటేః
ప్రతిష్టాత్మక ఎన్నిక ఇదిః
సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలోని 25 పార్లమెంట్ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ నిన్న ఉదయం 7 గంటల నుంచి అర్ధరాత్రి వరకూ జరిగింది. జరిగిన అన్ని ఎన్నికలతో పోల్చితే.. నిన్న జరిగిన ఎన్నిక చాలా ప్రతిష్టాత్మమైనదిగా చెప్పుకోవచ్చు. ఐదేళ్ల పాటు పరిపాలన కొనసాగించిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా తెచ్చుకోవాల్నా..? లేదంటే, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా, ప్రజలకు ఏ మేలు చేయని చంద్రబాబును మరలా అధికారంలోకి తేవాల్నా..? అనేది తేల్చే ఎన్నిక ఇది.
ఓటేసేందుకు వృద్ధులు, మహిళలు, వికలాంగుల తాపత్రయం;
గతంలో చంద్రబాబు పరిపాలన చూసినవారూ.. జగన్ పాలనతీరును చూసినవారూ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్న తీరును చూస్తే నాకు ఒకింత ఆశ్చర్యమేసింది. ఉదయం 5 గంటలకే మహిళలు, వృద్ధులు, వికలాంగులు పెద్ద ఎత్తున తరలివచ్చి పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో నిలబడ్డారు. గంటల తరబడి వేచియుండి మరీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిని చూసినప్పుడు ప్రతీ ఒక్కరి మొఖంలో ఒక ప్రత్యేకమైన తాపత్రయం కనిపించింది. ఈ వాతావరణం దేనికి సంకేతం..? దీనికి గల కారణాల్ని విశ్లేషించుకోవాల్సిన అవసరముంది.
మా బిడ్డ జగన్ సీఎం కావాలనే తాపత్రయంతో..ః
ఐదేళ్లపాటు సంక్షేమ కార్యక్రమాలు అందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తర్వాత .. ప్రతీ ఒక్క తల్లిలో ఒకటే భావన కనిపించింది. మా బిడ్డ జగన్మోహన్రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనే తాపత్రయంతో వారు గంటలతరబడి క్యూ లైన్లలో నిల్చొని వృద్ధులు, మహిళలు, వికలాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
70 శాతం మహిళలంతా ఫ్యాన్గుర్తుకే ..
ఎన్నికల ప్రక్రియలో నిన్న మహిళల ఓటింగ్ను పరిశీలిస్తే.. కులమతాలు, రాజకీయపార్టీలకతీతంగా 70 శాతం మంది వైఎస్ఆర్సీపీ వైపే మొగ్గు చూపి ఫ్యాన్గుర్తుకే ఓట్లేశారు. ఈ వాతావరణం నిన్న పోలింగ్లోనే కాదు. నా ఎన్నికల ప్రచారంలోనూ కనిపించింది. ముఖ్యంగా సత్తెనపల్లి నియోజక వర్గంలో ప్రతీ గ్రామంలోనూ పురుషులు కంటే మహిళల్లోనే జగన్ గారి పాలన పట్ల, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ సంక్షేమం పట్ల చాలా ఉత్సాహం కనిపించింది. ఎక్కడకెళ్లినా మహిళా సోదరీ, సోదరమణులే వైఎస్ఆర్సీపీ జెండాలు పట్టుకుని నా ప్రచార రథం ముందు సాగారు. మహిళా సాధికారత విషయంలో జగన్ చిత్తశుద్ధిని మహిళలు గుర్తించారు. కనుకే, వారు ఆయన్ను ఒక బిడ్డలా.. అన్నలా, సోదరుడిలా ఆరాధిస్తున్నా రు. అందుకే, గంటలతరబడి క్యూలైన్లలో నిల్చొని మరీ వేలిమీద ముద్ర వేయించుకుని ఫ్యాన్గుర్తుపై బటన్లు నొక్కారు.
6 చోట్లా వెబ్ కెమెరాల పరిశీలనతో రీపోలింగ్కు మా డిమాండ్ః
దమ్మాలపాడులో 253, 254, నార్నెపాడులో 236, 237, చీమలమర్రిలో 197, 198 బూత్లలోని వెబ్ కెమెరాలను పరిశీలించి .. ఆయా బూత్లలో రీపోలింగ్ పెట్టాలని నేను రిక్వెస్టు చేస్తున్నాను. సహేతుకమైన అభ్యంతరాలున్నప్పుడు ఎన్నికల సంఘం వాటిని పరిగణలోకి తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని గుర్తుచేస్తున్నాను. ఈ 6 చోట్లా వెబ్కెమెరాలను పరిశీలించి ఎన్నికల సంఘం రీపోలింగ్ నిర్వహించాలని మీడియా ద్వారా కూడా మరోమారు నేను డిమాండ్ చేస్తున్నాను.
జగన్ గారిని గెలిపించే తీర్పుః
చంద్రబాబు, పవన్కళ్యాణ్లు కలిసి పోలీసులును, పోలింగ్ అధికారులను డబ్బులు పెట్టి కొనుగోలు చేసినా.. లేదంటే, హింసను ప్రేరేపించి వారిని భయపెట్టినా.. ఎవరెన్ని కుట్రలు చేసినా.. జగన్మోహన్రెడ్డి గారిని ఎస్సీ, ఎస్టీలు, బీసీ, మైనార్టీలు ఒక తిరుగులేని నాయకుడిగా గుర్తించి గెలిపించేందుకు ఓట్లేశారు. చంద్రబాబు అనే మోసగాడికి తగిన బుద్ధిచెప్పేలా ప్రజలు తీర్పిచ్చారనేది జూన్ 4తేదీన అందరూ చూడబోతున్నాం.