సిరాన్యూస్, ఖానాపూర్
రెండు గ్రామాల్లో ఓటేసిన మాజీ సర్పంచ్ దంపతులు
* తహసీల్లార్కు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు
మాజీ సర్పంచ్ దంపతులు రెండు గ్రామాల్లో ఓటేసిన సంఘటన ఖానాపూర్ మండలంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మేడంపల్లి గ్రామానికి చెందిన సునీత, లింబాజి సుర్జాపూర్ లో గతంలో సర్పంచ్ గా విధులు నిర్వర్తించారు. మాజీ సర్పంచ్ దంపతులకు రెండు గ్రామాలలో ఓటర్గా పేరు నమోదైంది. సోమవారం పార్లమెంట్ ఎన్నికల్లో సుర్జాపూర్ గ్రామంలో ఓటు ఉండగా మొదట మేడంపల్లి గ్రామంలో ఓటు వేశారు. అనంతరం సుర్జాపూర్లో మళ్లీ ఓటు వేశారు. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమని, వారిద్దరిపై చర్య తీసుకోవాలని మంగళవారం ఖానాపూర్ ఎమ్మార్వో కు మేడంపల్లి, సుర్జాపూర్ గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఇందులో జడ్పీటీసీ ఆకుల వెంకగౌడ్ , ఎంపీటీసీ జంగిలి శంకర్, సర్పంచ్ గుగలవత్గ్ రాజేందేర్ , మండల అధ్యక్షులు దొనికిని దయానంద్, గ్రామ అధ్యక్షులు గాజుల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ నిట్ట రవి, జంగిలి నర్సయ్య, గాజుల గంగన్న, శ్యామ్, మంగలరపు రవి, కోట మల్లేష్, బనవత్ దేవిజి, గ్రామస్తులు ఉన్నారు.