సిరాన్యూస్, ఆదిలాబాద్
గండ్రత్ సుజాత, అల్లూరి సంజీవ్రెడ్డి పార్టీ ద్రోహులు: కంది శ్రీనివాసరెడ్డి
బీజేపీ వద్ద పైసలు తీసుకుని కాంగ్రెస్కు ద్రోహం
* పాయల్ శంకర్ వన్టైం ఎమ్మెల్యేనే..రాజకీయంగా భస్మం కావడం తథ్యం
* ఎన్నికల్లో కష్టపడి పని చేసిన వారికి ధన్యవాదాలు
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నమ్మించి నయవంచన చేశారని, గండ్రత్ సుజాత, అల్లూరి సంజీవ్రెడ్డి పార్టీ ద్రోహులని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని, డబ్బుల సంచులు తీసుకుని తమ కార్యకర్తలను గందరగోళానికి గురిచేశారని వ్యాఖ్యనించారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని విచ్చిన్నం చేయాలనుకునేవారికి కార్యకర్తలే సరైన బుద్ధిచెబుతారంటూ హితవు పలికారు. అటు పాయల శంకర్ వన్టైం ఎమ్మెల్యేనని, డబ్బుమీదున్న ప్రేమే ఆయన్ను భస్మం చేస్తుందని జోస్యం చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని ప్రజాసేవా భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారితీరుపై ఆదిలాబాద్ కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి ఘాటుగా వ్యాఖ్యనించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వద్ద డబ్బులు తీసుకుని పార్టీ ద్రోహులుగా మిగిలిపోయారన్నారు. మళ్లీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనూ బుద్ధి తెచ్చుకోకుండా బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారంటూ విమర్శించారు. పైకి కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్నట్లు నటించి..బీజేపీ దగ్గర డబ్బులు తీసుకున్నారని స్వయంగా ప్రజలే అంటున్నారన్నారు. సిగ్గులేకుండా వారు రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. బీజేపీకి ఓట్లు వేయించినట్టు తెలుస్తోందని, పక్కా ఆధారాలతో త్వరలోనే వారి బండారం బయటపెడతామన్నారు. ఆదిలాబాద్ ప్రజలు వారివురికి రాజకీయంగా ఎక్స్పైరీ డేట్ ఇచ్చినా, ప్రజలు ఛీకొడుతున్నా సిగ్గు రావడంలేదన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేరన్నారు. అటు కొడుకు-అల్లుడిని అడ్డంపెట్టుకుని ఎమ్మెల్యే పాయల శంకర్ భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆయనకు డబ్బుమీద యావ తప్ప ప్రజలపై ప్రేమలేదన్నారు. అదే ఆయనను రాజకీయంగా భస్మం చేస్తుందంటూ జోస్యం చెప్పారు. మహిళలను బొట్టు ఎందుకెట్టుకున్నావని ప్రశ్నించడం సిగ్గుచేటన్నారు. మహిళలను కించపరచాలని చూసే శంకర్ది ఇదేనా సంస్కారం అంటూ ప్రశ్నించారు. ఆదిలాబాద్ ప్రజలు కుల, మతవిద్వేషాలకు ధీటైన తీర్పును ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడ్డ తన ప్రాణ సామానులైన కార్యకర్తలు, నాయకులు, పార్టీ అభిమానులకు కంది శ్రీనివాసరెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రేవంత్రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన సాగుతోందని, పార్టీ మరింత బలోపేతం అవుతోందని తెలిపారు. అందరి సేవలోనే కాంగ్రెస్ పార్టీ ఉంటదని.. పార్టీ కోసం కష్టపడ్డవారిని ఆదరిస్తుందని పేర్కొన్నారు. ఆదిలాబాద్ అదృష్ణరేఖ తమ మంత్రి సీతక్క ప్రచారాన్ని మొత్తం తన భజాలపై వేసుకుని నడిపించిందన్నారు. ఎమ్మెల్యే వెడ్మబొజ్జుతోపాటు అసెంబ్లీ ఇన్చార్జీలు, సీనియర్ నాయకులు అందరూ పార్టీ గెలుపు కోసం విశేషంగా కృషి చేశారన్నారు.టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేష్ ఇక్కడే ఉండి పలు సూచనలు చేశారన్నారు. కార్యకర్తలందరూ కొత్త ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటువేసేలా మార్గదర్శనం చేయడంలో సఫలమయ్యారన్నారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, లోక ప్రవీణ్రెడ్డి, కౌన్సిలర్లు కలాల శ్రీనివాస్, ఆవుల వెంకన్న, సాయి ప్రణయ్, నాయకులు సుధాగోని సుధాకర్ గౌడ్, గడ్డం జగదీష్ రెడ్డి, మునిగెల విట్టల్, గంగారెడ్డి, తమ్మల చందు, కిజర్ పాషా, బూర్ల శంకరయ్య, కయ్యుమ్, నూర్ ఖాన్, కయ్యుమ్, రజా, మున్నా, యోగేష్, వదూద్, అన్నెల శంకర్, వసంత్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.