సిరాన్యూస్, ఓదెల
కరీంనగర్లో రూ.5లకే భోజనం
గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదు రూపాయలకే అన్నపూర్ణ భోజనం పథకం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్నకళాభారతి భవనంలో నిర్వహిస్తున్నారు. పేద, మధ్యతరగతి వారికి, జిల్లా కేంద్రానికి వచ్చి పోయే ప్రజలకు ఆకలి నింపడానికై అన్నపూర్ణ భోజనం పథకం అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ అన్నపూర్ణ భోజన పథకాన్ని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కూడా ప్రవేశపెట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.