సిరాన్యూస్, చిగురుమామిడి
పురుగుల మందు తాగి వ్యవసాయ కూలీ ఆత్మహత్య
పురుగుల మందు తాగి వ్యవసాయ కూలీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బొమ్మనపల్లి గ్రామానికి చెందిన పెద్ద బత్తుల వెంకటయ్య (45) వ్యవసాయం కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలోనే మంగళవారం వెంకటయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వెంకటయ్యను ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.