స్ట్రాంగ్ రూములను పరిశీలించిన కలెక్టర్

 సిరా న్యూస్,ఖమ్మం;
లోక్ సభ సాధారణ ఎన్నికల పోలింగ్ సంబంధించిన పత్రాలను పక్కాగా పరిశీలించామని ఖమ్మం పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఖమ్మం పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి ఖమ్మం రూరల్ మండలం, పొన్నెకల్ లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం స్ట్రాంగ్ రూమ్ లలో యంత్రాల తరలింపు ప్రక్రియ అనంతరం ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు డా. సంజయ్ జి కోల్టేతో కలిసి పోటీలో ఉన్న అభ్యర్థులు/ ఎన్నికల ఏజెంట్లతో పోలింగ్ సంబంధించిన పత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ప్రశాంతంగా పోలింగ్ ముగిసిందని, ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, ప్రతి పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ముగిసిన అనంతరం పటిష్ట బందోబస్తు నడుమ ఇవిఎం యంత్రాలను రిసెప్షన్ సెంటర్ కు, అక్కడి నుండి స్ట్రాంగ్ రూములకు తరలించామని అన్నారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, గతం కంటే అధిక పోలింగ్ జరిగిన పోలింగ్ కేంద్రాల పత్రాలను పరిశీలించారు. 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో జరిగిన పోలింగ్ సరళి వివరాలను రిటర్నింగ్ అధికారి వివరించారు.
====================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *