పల్నాడు జిల్లాలో సెక్షన్ 144 విధిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు

 సిరా న్యూస్,పల్నాడు;
పల్నాడులో మాచర్ల సహా పలు నియోజకవర్గాల్లో పరిస్థితిపై అధికారులు స్పందించారు. వెంటనే 144 సెక్షన్ అమలు చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసారు. వైసీపీ రౌడీ మూకలు, ఎమ్మెల్యే ప్రైవేటు సైన్యం హల్ చల్, దాడులపై ఉన్నతాధికారులకు టీడీపీ అధినేత చంద్రబాబు పిర్యాదు చేసారు. డీజీపీకి, గవర్నర్ కు పల్నాడులో శాంతి భద్రతల పరిస్థితిపై లేఖ రాసారు. మంగళవారం రాత్రి మాచర్లలో దాడులు జరిగే అవకాశం ఉందనే సమాచారంతో పోలీసులు అలెర్టైయారు. డీజీపీ పారామిలటరీ బలగాలను పల్నాడుకు పంపారు. మాచర్ల పట్టణంతో పాటు, గ్రామాల్లో పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటుచేసారు. ప్రస్తుతం 800 మంది అదనపు బలగాలను మాచర్ల నియోజకవర్గానికి పంపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *