మూడు రోజులు…వానలే.. వానలు

సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో వాతావరణం క్రమేపీ చల్లబడుతోంది. ఎండల తీవ్రత తగ్గింది. కొన్ని ప్రాంతాల్లో 47 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు.. ప్రస్తుతం 40 డిగ్రీలకు పడిపోయింది. దీనికి కారణంగా ఉపరితల ఆవర్తనమే అని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. మహారాష్ట్రలోని పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో అవర్తనం ఏర్పడిందని.. దీని కారణంగా రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్నారు.
గురువారం..
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, 30-40 కిమీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
శుక్రవారం..
ఉరుములు, మెరుపులు, 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
అలాగే ఉరుములు, మెరుపులు, 30-40 కిమీ వేగంతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
శనివారం..
ఉరుములు, మెరుపులు, 30-40 కిమీ వేగంతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *