సిరా న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం వడ్డెర పురం గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టించేందుకు చందా ఇవ్వలేదని 20 కుటుంబాలను బహిష్కరించిన ఘటన వెలుగులోకి వచ్చింది బొడ్రాయి ప్రతిష్టించేందుకు కుటుంబానికి 3000 చెల్లించాలని గ్రామ పెద్దలు నిర్ణయం తీసుకోవడంతో అదే ఊరిలో అదే కులానికి చెందిన 20 కుటుంబాలు 3000 ఇవ్వలేము అన్నందుకు ఊరిలో ఎవరు మాట్లాడాకపోగా నిత్యవసర సరుకులు అమ్మిన వారికి కూడా 5000 జరిమానా విధిస్తామంటూ గ్రామ పెద్దలు చెప్పడంతో ఏం చేయాలో పాలు పోగొట్టడం లేదని బాదితులు తెలిపారు.. ఈ రోజుల్లో కూడా ఈ విధంగా గ్రామ బహిష్కరణ చేయడం చర్చనీయాంశంగా మారింది…
=====================