సిరా న్యూస్,సంగారెడ్డి;
సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ పరిధిలోని లక్ష్మి నగర్ కాలనీలో అర్ధరాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షానికి గోడ కూలి పక్కింట్లో నిద్రిస్తున్న వారిపై పడడంతో ఒరిస్సా కు చెందిన ప్రపుల్ల మహాకూడ్(52) మృతి చెందగా వారి కుటుంబ సభ్యుల్లో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
======================