సిరాన్యూస్, ఖానాపూర్
ఖానాపూర్ లో బీఆర్ఎస్ నాయకుల రాస్తారోకో
రైతులకు ఇచ్చిన వాగ్దానాన్ని సీఎం రేవంత్ రెడ్డి విస్మరించి మోసం చేస్తున్నారని గురువారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో జగన్నాథరావు చౌరస్తాలో బీఆర్ఎస్ రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్బంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ రైతులు పండించిన వరి పంటకు రూపాయలు 500 బోనస్ ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.