రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

సిరా న్యూస్,జయశంకర్ భూపాలపల్లి,

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు.
గురువారం స్థానిక వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగుల ఓ.పీ రిజిస్టర్, శానిటైజేషన్ ను
క్రిటికల్, కాజ్ వాలిటి, ఆపరేషన్ థియేటర్ ను పరిశీలించారు.
గతంలో ఆపరేషన్ ధియేటర్ కు కావలసిన వైద్య పరికరాలకు నిధులు మంజూరు చేయగా ఆపరేషన్ థియేటర్ కు నూతనంగా కొనుగోలు చేసిన వైద్య పరికరాలను ఆపరేషన్ థియేటర్లోకి ఆఫ్రాన్ ధరించి వెళ్లి పరిశీలించారు.
అనంతరం గతంలో ఆసుపత్రికి 5 ఎయిర్ కండిషనర్లు (ఎసిలు) మంజూరు చేశామని వాటి వినియోగం గురించి అడిగి తెలుసుకున్నారు. వివిధ రకాల వ్యాధులు బారిన పడిన ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లి చికిత్స తీసుకోకుండా స్థానిక వంద పడకల ఆసుపత్రి లోనే ఆర్థో సేవలు అందుబాటులోకి తేవడం వల్ల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని అన్నారు. ఆసుపత్రి లోని వైద్యులు ఓ.పి కోసం వచ్చే రోగులు నిలబడవలసి వస్తుందని, రోగులకోసం 60 త్రీ సీటర్ చైర్స్ మంజూరు చేయాలని. విజ్ఞప్తి చేయగా తక్షణమే మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగుల యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం
వైద్యులతో మాట్లాడుతూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, చికిత్సకు వచ్చే ప్రజల పట్ల మర్యాదగా, సానుకూలంగా వ్యవహరించాలని సూచించారు. వారికి
మనోధై ర్యాన్ని కల్పించాలని అన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ కోడూరి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *