షరతులు లేని బోనస్ రైతులకు ఇవ్వాలి

మాజీ ఎమ్మెల్యే దాసరి
సిరా న్యూస్,పెద్దపల్లి ప్రతినిధి:
పార్లమెంట్ ఎన్నికల అనంతరం 500 రూపాయలు బోనస్ ఇస్తానని ప్రకటించిన సీఎంరేవంత్ రెడ్డి ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ చౌరస్తా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నిరసన కార్యక్రమం చేపట్టారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచించి మోసం చేశారని విమర్శించారు. రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేఖ విధానాలను ప్రక్కన పెట్టి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు 2500 ఇప్పటి వరకు అమలు చేయలేదని, అన్ని అమలు అయ్యే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజలు ,రైతులు వెంటే ఉంటదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లు పొన్నమనేని బాలాజీ రావు, నూనెటి సంపత్, తానిపర్తి స్రవంతి మోహన్ రావు,మహిళా నాయకురాలు దాసరి ఉషా, మండల పార్టీ అధ్యక్షులు ఐరెడ్డి వెంకట్ రెడ్డి, బైరెడ్డి రాంరెడ్డి, మార్కు లక్ష్మణ్ , జిల్లా కో ఆర్డినేటర్ కొయ్యడ సతీష్, పట్టణాధ్యక్షులు ఉప్పురాజ్ కుమార్, పాక్స్ ఛైర్మెన్ లు ,వైస్ ఎంపీపీ లు,గౌరవ కౌన్సిలర్ లు,ఎంపీటీసీ లు,మాజీ సర్పంచ్ లు, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.
======

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *