సిరాన్యూస్, భీమదేవరపల్లి
ముఖ్యమంత్రిని కలిసిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్లు
మాదాపూర్ దస్పల్లా హోటల్ లో గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారితో సీఎం సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా ప్రతి ఒక్కరితో ముఖ్యమంత్రి ఫోటో దిగారు. ఈకార్యక్రమంలో నియోజకవర్గ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ అలెక్స్, నియోజక వర్గంలో ఏడు మండల కోఆర్డినేటర్లు హుస్నాబాద్ మంద పరశురాం, సైదాపూర్ మండల కో-ఆర్డినేటర్ అజయ్ కుమార్ గౌడ్ తాళ్లపల్లి, కోహెడ మండలం మహమ్మద్ అబ్దుల్ రఫీ, చిగురుమామిడి మండలం గట్టు ప్రశాంత్, అక్కన్నపేట మండలం పంగ రాకేష్, భీమదేవరపల్లి మండల రమేష్, హుస్నాబాద్ హరీష్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.