ఖమ్మం టౌన్ లో రాకేష్ రెడ్డి ప్రచారం

సిరా న్యూస్,ఖమ్మం;
ఉమ్మడి వరంగల్ – ఖమ్మం – నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అనుముల రాకేష్ రెడ్డి ఖమ్మంలో ప్రచారం చేసారు. ఎస్సార్ అండ్ బీజీఎన్నార్ డిగ్రీ కళాశాల గ్రౌండ్లో జిల్లా అధ్యక్షులు తాతా మధు తో కలిసి వాకర్స్ ను ఓటు అభ్యర్థించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదట ప్రాధాన్యత ఓటు 3వ నెంబర్ పై వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను అనగ తొక్కుతుందన్నారు. సమస్యలపై ప్రశ్నించే గొంతులను నొక్కి ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు నాగరాజు,బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్ జె సి కృష్ణ, కార్పొరేటర్లు,బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *