Vijayaraman Rao: రైతులు  ఎవరు అధైర్యపడవద్దు : ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు

సిరాన్యూస్‌, ఓదెల
రైతులు ఎవరు అధైర్యపడవద్దు : ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు
* ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్ సంద‌ర్శ‌న‌

రైతులు ఎవరు అధైర్యపడవద్దు అని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. మండలం కొలనూరు గ్రామంలో శుక్రవారం ఉదయాన్నే ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్‌ను ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు సందర్శించారు. గురువారం రాత్రి కురిసిన వర్షానికి తడిసిన వడ్లను పరిశీలించారు. అలాగే లారీల కొరత లేకుండా చూడాలని, వడ్లు మ్యాచర్ చూసి ఎలాంటి కటింగ్ లేకుండా వడ్లను కొనుగోలు చేయాలని చెప్పారు. వారం రోజుల్లో పూర్తిస్థాయిలో వడ్లను కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు వచ్చిన తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. కార్యక్రమంలో ఓదెల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మూల ప్రేమ సాగర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, గోపు నారాయణరెడ్డి, బైరి రవికుమార్, శంకర్, పరిష రమేష్, మాజీ సర్పంచులు ఢిల్లీ శంకర్, కుంచం మల్లయ్య ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *