ఎర్రగుంట్ల లో నీరు కలుషితం..పలువురు ఆసుపత్రిపాలు

 సిరా న్యూస్,నంద్యాల;
నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం ఎర్రగుంట్ల గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ కలుషితం కావడంతో మంది 50 మంది అతిసారా బారిన పడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులందరూ నంద్యాల జిజిహెచ్ లో చికిత్స పొందుతున్నారు.గ్రామంలో రెండు మినరల్ వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. వీటితో పాటు కొన్ని ప్రాంతాలకు బోరు ద్వారా వీటిని సనాఫరా చేస్తున్నారు.కానీ వాటర్ ప్లాంట్ ను సకాలంలో శుభ్రం చేయకపోవడంతో నీరు కలుషితమైంది. రోజు లాగే ఈ నీటిని తాగినవారు అతిసారా బారిని పడ్డారు. బోర్ల ద్వారా నీటిని సరాపరా చేసిన సమయంలో పైపులైన్లలోకి డ్రైనేజీ నీరు చేరింది.దీంతో బీసీ కాలనీ,ఎస్సీ కాలనీ ప్రాంతాల్లో కలుషిత నీరు సరఫరా కావడంతో ప్రజలు వాంతులు విరోచనాలకు గురయ్యారు.రెండు రోజులు గడిచిన వాంతులు,వీరేశనాలు అదుపులోకి రాకపోవడంతో ఆసుపత్రిలో చేరారు.అతిసారా ప్రవాహం అధికంగా ఉండడంతో 50 మంది బాధితులను నంద్యాల జిజిహెచ్ లో చేర్పించారు. వీరిలో వ్యవసాయ కూలీ రమణ పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసియులో చికిత్స అందజేస్తున్నారు. మరో 20 మంది గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో చికిత్స పొందుతున్నారు.గ్రామంలో అతి సార ప్రబలిన విషయం తెలియడంతో ట్యాంకర్ ల ద్వారా నీటిని సరఫరా పంచాయతీరాజ్ అధికారులు సరఫరా చేస్తున్నారు. గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారి వెంకటరమణ గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ప్రజలు అందరు భయపడవలసిన అవసరం లేదని అన్నారు.
===========

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *