Jadhav Anil: రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలి:  ఎమ్మెల్యే జాదవ్ అనిల్

సిరాన్యూస్, బోథ్‌
రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలి:  ఎమ్మెల్యే జాదవ్ అనిల్
* రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి
* బోథ్ మార్కెట్ యార్డ్ సంద‌ర్శ‌న‌

రైతులు పండించిన పంటను ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేసి ఆదుకోవాలని బోథ్‌ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మార్కెట్ యార్డ్ ను ఎమ్మెల్యే జాదవ్ అనిల్ సందర్శించి, మార్క్‌పెడ్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న కొనుగోళ్ల‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఈవో గోలి స్వామిని పంట కొనుగోలు విషయమై అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మార్కెట్ కమిటీ సెక్రటరీకి సూచించారు. అంతేగాక రైతులు పంట తడిసిందని, ధైర్యపడవద్దని తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయించడం జరుగుతుందన్నారు. అంతేగాక రైతులకు తాగునీటి వసతి తో పాటు తూకం లో ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *