సిరాన్యూస్, చిగురుమామిడి
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి
* 500 బోనస్, రైతు రుణమాఫీ ఎక్కడ
* రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం వైఫల్యం
ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అన్నారు. శనివారం చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరి ధాన్యానికి 500 బోనస్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు సన్నవడ్లకే వర్తింప చేస్తామని చెప్పడం రైతులను మోసం చేయడం అవుతుందన్నారు.లక్షలాది మంది రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి గడువు,దేవుళ్ళ పేరిట ఓట్టు వేయడం ఏంటని ప్రశ్నించారు. రైతుల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పైడిపల్లి శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి పోన్నం, శ్రీనివాస్ మండల కార్యదర్శి బుర్ర శ్రీనివాస్,కంటే శ్రీనివాస్,ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు గార్డస్ సతీష్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు గుళ్ళ కిష్టయ్య ,బిజెపి సీనియర్ నాయకులు కొంకటి లక్ష్మణ్, కూన పోచయ్య,రామ్ రెడ్డి, బిమర లక్ష్మన్ బూత్ అధ్యక్షులు బుర్ర సతీష్,తులాల వెంకటేశ్వర్లు, ఎన్నము సంతోష్, కొంకటి లక్ష్మి, సాయి,కిరణ్,సాత్విక్, పోతరవేని శ్రీనివాస్,రాకేష్ తదితరులు పాల్గొన్నారు.